ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత మరియు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు . ఈ రోజు వారు యూరప్ ట్రిప్కు బయలుదేరి వెళ్తారు ..ఈ నెల 19 నుంచి 24 వరకు నారావారి ఫ్యామిలీ అక్కడే ఉంటారు.. నిజానికి ఈ పర్యటన ముందే ఉండాల్సి ఉంది . కానీ ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవడం వల్ల పర్యటనను రద్దు చేసుకున్నారు చంద్రబాబు .. గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన అయన తర్వాత ఎన్నికల ప్రచారంతో బిజీ బిజీ అయ్యారు. కుటుంబంతో కూడా సరిగా గడపలేకపోయారు. ఎన్నికల తర్వాత కాస్త విరామం దొరకడంతో ఆయన హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత అయన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు ..