Nara Lokesh: నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడింది

Nara Lokesh: నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా ఇంటి గోడను కూల్చివేశారు

Update: 2022-06-19 04:23 GMT

Nara Lokesh: నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడింది

Nara Lokesh: వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడిందని జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చివేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన ప్రజాదరణ చూసి.. వైసీపీ ప్రభుత్వం ఓర్వలేక అయ్యన్నపై కక్ష కట్టిందని లోకేష్‌ మండిపడ్డారు. మూడేళ్ల తర్వాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందని లోకేష్ అన్నారు.

Tags:    

Similar News