తాడేపల్లిలోని క్రిస్టియన్ పేటలోని 34, 37 పోలింగ్ బూత్ల పరిశీలనకు 5 గంటల సమయంలో వచ్చిన లోకేశ్ అక్కడే ధర్నాకు దిగారు. పోలింగ్ సరళని పరిశీలించడానికి బూత్లోకి వెళ్లారు. ఈలోగా అక్కడికి చేరుకున్న వైసీపీ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో లోకేష్.. వైసీపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని ఆరోపిస్తూ.. 100 మంది కార్యకర్తలతో సహా ధర్నాకు దిగారు. అక్కడే మీడియా సమావేశం నిర్వహించి.. ఎన్నికల కమిషన్పై విమర్శనాస్త్రాలు సంధించారు.