టీడీపీ మహిళా నాయకురాలు నన్నపునేని రాజకుమారి మహిళా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్కి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశానన్నారు నన్నపనేని రాజకుమారి. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ.. మూడేళ్ల రిపోర్ట్ను గవర్నర్కు అందజేశానన్నారు. తన హయాంలో ఎందరో బాధిత మహిళలకు అండగా నిలిచానని పేర్కొన్నారు. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని నన్నపనేని రాజకుమారి స్పష్టం చేశారు.