పబ్లిక్‌ జిమ్‌లో నగరి ఎమ్మెల్యే వ్యాయామం

Update: 2019-10-02 11:54 GMT

ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా కాసేపు జిమ్ చేశారు. చిత్తురు జిల్లా పుత్తూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పబ్లిక్ జిమ్ ను నేడు ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన పరికరాలతో కాసేపు వ్యాయామం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక వైసీపీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఎమ్మెల్యే రోజా చెప్పారు. ప్రజలంతా ఈ ఓపెన్ జిమ్‌ను ఉపయోగించుకొని నిత్య వ్యాయామం చేయాలని సూచించారు.

Tags:    

Similar News