విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం

Vijayawada: విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

Update: 2022-07-01 13:21 GMT

విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం

Vijayawada: విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వంగవీటి రాధాను కలిశారు జనసేన నేత నాదెండ్ల మనోహర్‌. ఆదివారం MBVK భవన్‌లో జనసేన జనవాణి కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు నాదెండ్ల మనోహర్‌. అయితే పక్కనే రాధా ఆఫీస్‌ ఉండటంతో ఆయన్ను కలిసేందుకు వెళ్లారు నాదెండ్ల.

విషయం తెలుసుకున్న రాధా నాదెండ్ల మనోహర్‌కు సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రస్తుత రాజకీయాలపై ఇరువురు చర్చించారు. ఇదిలా ఉంటే జనసేనలో రాధా చేరుతారంటూ సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. దీంతో నాదెండ్ల మనోహర్‌, వంగవీటి రాధా భేటీపై రాజకీయంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News