వైసీపీ ఆరునెలల పాలనపై ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్
జగన్ ఆరునెలల పాలనపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
జగన్ ఆరునెలల పాలనపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అందులో 'నిరుద్యోగ యువతకు 4 లక్షల ఉద్యోగాలిచ్చారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసి 52 వేల మంది కార్మికులకు భరోసా కల్పించారు. ఏటా ఉద్యోగ నియామకాలు జరుగుతాయని నిరుద్యోగులకు ధైర్యాన్నిచ్చారు.
అసాధారణ మెజారిటీ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం తపిస్తున్నారు.' అని పేర్కొన్నారు. అంతేకాదు జగన్ కు ఓటు వేసినందుకు కేవలం ఆరునెలల్లోనే దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపారని.. అవినీతి రహిత & పారదర్శక ప్రభుత్వం, అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.
నిరుద్యోగ యువతకు 4 లక్షల ఉద్యోగాలిచ్చారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసి 52 వేల మంది కార్మికులకు భరోసా కల్పించారు. ఏటా ఉద్యోగ నియామకాలు జరుగుతాయని నిరుద్యోగులకు ధైర్యాన్నిచ్చారు. అసాధారణ మెజారిటీ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకునేందుకు @AndhraPradeshCM గారు నిరంతరం తపిస్తున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 1, 2019