సీఎం జగన్ తో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, హోంమంత్రి మేకతోటి సుచరిత భేటీ అయ్యారు. వినాయక చవితి సందర్భంగా తనకు జరిగిన అన్యాయాన్ని జగన్కు శ్రీదేవి వివరించారు. కులం పేరుతో దూషించారని తెలిపారు. రాష్ట్రంలో ఏ మహిళకు ఇటువంటి పరిస్థితి రాకూడదని జగన్ అన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని హోం మంత్రి సుచరితను ఆదేశించారు.