నిడదవోలు: కరోనా వైరస్ కు తీసుకోవలసిన చర్యలపై నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రోజు పట్టణంలోని మున్సిపల్ రెవిన్యూ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ... పట్టణంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను కొనసాగించాలని అలాగే పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు.