వైసీపీనేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లిలో ఓ వివాహ వేడుకకు హాజరైనా అయన వధువరులను ఆశీర్వదించే సమయంలో వేదిక కుప్పకూలింది. ఈ క్రమంలో ఆళ్ల కింద పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్నవారు ఆయనని పైకి లేపి సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆయనకి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు కంగారుపడ్డారు. అనంతరం ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. చికిత్స అనంతరం అయన తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. అయన ఇంటికి వెళ్లి పలువురు వైసీపీ నేతలు పరామర్శించారు.