కృష్ణా జిల్లాలో సంచలనం రేపుతోన్న మహిళ అదృశ్యం

Update: 2020-12-20 07:32 GMT

కృష్ణా జిల్లాలో మహిళ అదృశ్యం సంచలనం రేపుతోంది. ఈ నెల 16న కువైట్ నుంచి వచ్చిన దుర్గ కనిపించకుండా పోయింది. దాంతో బాధిత కుటుంబం గన్నవరం పోలీసులను ఆశ్రయించారు. గన్నవరానికి చెందిన సాలసత్తి దుర్గ రెండేళ్ల క్రితం కువైట్ వెళ్లింది. ఈ నెల 16న దుర్గ ఇండియాకు తిరిగి వచ్చింది. గన్నవరం విమానాశ్రయం టెర్మినల్ బయటకు వచ్చినట్టు వాట్సాప్ లో మెసేజ్ కూడా పెట్టినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి సహాకారంతో విమానాశ్రయంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. అయితే అందులో టెర్మినల్ నుంచి బయటకు వచ్చినట్టు గుర్తించారు.

Full View


Tags:    

Similar News