విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన పెను ప్రమాదం

Update: 2019-08-20 01:19 GMT

విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. నర్సీపట్నం అడ్డరొడ్డు స్టేషన్ వద్ద.. బోగీలతో ఇంజిన్‌కు లింక్ తెగిపోయింది. దీంతో.. బోగీలను వదిలి ఇంజిన్ కొంత దూరం వెళ్లిపోయింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఇంజన్ ను నిలిపివేసింది. అరగంట తర్వాత.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌ వెనక్కి తీసుకువచ్చారు. అప్పుడు బోగీలతో బయల్దేరింది రైలు.

Tags:    

Similar News