మంత్రి తానేటి వనిత మానవత్వం చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం ఊసగట్ల వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో కాంతమ్మతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. అటుగా వెళుతూ ప్రమాదం చూసి చలించిన మంత్రి వనిత గాయపడ్డ వారిని దగ్గరుండి నిడదవోలు గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. ఆస్పత్రి సూపరిండెంట్తో మాట్లాడి తక్షణం వైద్యం అందించాలని మంత్రి కోరారు.