తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

Karumuri: ఏపీలో మరోసారి జగన్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది

Update: 2024-02-22 09:31 GMT

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

Karumuri: తిరుమల శ్రీవారిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్ధ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రాలతో సత్కరించారు. ఏపీలో మరోసారి జగన్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేసే జర్నలిస్ట్ లపై దాడి ఎవరు చేసిన ఖండిచ దగ్గ విషయమన్నారు.

Tags:    

Similar News