Visakhapatnam: కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టాం

కరోనా వ్యాప్తి నివారణపై మంత్రులు సమీక్షించారు. జిల్లాలో కేసుల నమోదు తీరు, నిర్థారణ పరీక్షలపై అధికారులతో చర్చించారు.

Update: 2020-04-10 17:26 GMT
Minister Kannababu

కరోనా వ్యాప్తి నివారణపై మంత్రులు సమీక్షించారు. జిల్లాలో కేసుల నమోదు తీరు, నిర్థారణ పరీక్షలపై అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కన్నబాబు వివరాలు వెల్లడించారు. విశాఖలో పాజిటివ్ కేసు నమోదు కాకముందు నుంచే వైరస్ కట్టడికి చర్యలు తీసుకున్నామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ నేతృత్వంలో 21 కమిటీలు పని చేస్తున్నాయని చెప్పారు. 2.06లక్షల మంది కంటైన్మెంట్ జోన్లలో ఉన్నారని తెలిపిన మంత్రి...విమ్స్ లో 148 క్రిటికల్ కేర్, 140 నాన్ క్రిటికల్ కేర్ పడకలు ఉన్నాయని చెప్పారు. విశాఖలో 151 మందిని క్వారంటైన్​లో ఉంచామని వెల్లడించారు.

Tags:    

Similar News