ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఏకగ్రీవం జరగాలి: బొత్స

*గ్రామ స్వరాజ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: బొత్స

Update: 2021-01-26 16:14 GMT

బొత్స  సత్యనారాయణ ఫైల్ ఫోటో 

గ్రామ స్వరాజ్యానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా... గ్రామల అభివృద్ధి జరగాలంటే ఏకగ్రీవం కావాలని తెలిపారు. కొంత మంది కులాల వారిగా గ్రామాలను విభజించడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఇక ఎస్‌ఈసీ ఎవరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుందో చెప్పాలని బొత్స డిమాండ్‌ చేశారు. తాము వచ్చాక మొదలు పెట్టినవి కావని, 2001 లోనే ఏకగ్రీవాలు ప్రారంభం అయ్యాయని వివరించారు. ఎక్కువ శాతం ఏకగ్రీవాలు చేసుకునేందుకు ప్రత్యేక అధికారిని నియమించుకున్నారన్న ఎస్‌ఈసీ భాష ఏమాత్రం బాగోలేదని బొత్స సత్యనారాయణ విమర్శించారు. 




Tags:    

Similar News