సీఆర్డీఏ రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బొత్స

Update: 2020-01-20 06:32 GMT
సీఆర్డీఏ రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చించేందుకు మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సీఆర్‌డీఏ రద్దు బిల్లును మున్సిపల్‌ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు. అలాగే అమరావతి అథారిటీ బిల్లును కూడా ఆయన సభ ముందు ఉంచారు. అంతకుముందు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. 

Tags:    

Similar News