భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ శబరిమల యాత్రకు వెళ్లారు. గతనెల అయప్ప మాల ధరించిన మంత్రి అనిల్.. కేరళలోని శబరిమల ఆలయానికి కాలినడకన చేరుకొని అయ్యప్పను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి దగ్గరుండి పూజలు చేయించారు. అనంతరం ఆయన రాష్ట్రానికి తిరుగుపయనయ్యారు. మంత్రి వెంట సహచర అయ్యప్ప దీక్ష ధరించిన భక్తులు ఉన్నారు. కాగా నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అనిల్ కుమార్ యాదవ్.. ప్రస్తుతం జగన్ కేబినెట్లో జలవనరుల శాఖా మంత్రిగా కొనసాగుతున్నారు.
keywords : minister Anil kumar yadav, Sabarimala, on foot