Ambati Rambabu: అమరావతి స్కామ్‌కు పునాది వేసింది చంద్రబాబే..

Ambati Rambabu: పోలవరంపై అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు చర్చకు సిద్దమా అని మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు.

Update: 2022-09-14 13:57 GMT

Ambati Rambabu: అమరావతి స్కామ్‌కు పునాది వేసింది చంద్రబాబే..

Ambati Rambabu: పోలవరంపై అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు చర్చకు సిద్దమా అని మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపొడానికి ఎవరు కారణమో వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. సభకు రానని శపధాలు చేసిన చంద్రబాబు రాష్ట్రపతి ఓటు వేయడానికి ఎలా వచ్చారని ప్రశ్నించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించేందుకే అమరావతి పాదయాత్ర. అమరావతి అనేది ఓ పెద్ద స్కామ్‌. ఆ కుంభకోణానికి పునాది వేసింది చంద్రబాబే. అమరావతి పాదయాత్రలో ఒక్క రైతు అయినా ఉన్నారా? అని ప్రశ్నించారు. రాజదానిపై మాజీ సీఎస్ iyr కృష్ణారావు రాసిన పుస్తకం అందరూ ఒకసారి చదవాలని సూచించారు. ఎవరెన్ని పాదయాత్రలు చేసినా వికేంద్రీకరణే మా లక్ష్యమని తేల్చి చెప్పారు.

Tags:    

Similar News