విజయనగరం జిల్లా కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే మనస్తాపంతో ఆమె మూడు నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉంది. అయితే తన భర్తపై ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించ లేదని ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. స్పందన కార్యక్రమం జరుగుతుండగానే చీమల మందు తాగింది. తక్షణమే స్పందించిన అధికారులు 108 వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు. బొబ్బిలి మండలం అలజంగి గ్రామనికిచెందిన వసుందరగా గుర్తించారు.