భార్యను డ్రైనేజీలో పడేసిన భర్త.. అపస్మారక స్థితిలో రాత్రంతా అక్కడే!

భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త తన భార్యను తీవ్రంగా కొట్టాడు. తనపై ఇంకా కోపం చల్లారకా ఇంటి ముందున్న మురికికాల్వలో పడేశాడు.

Update: 2020-02-20 09:25 GMT

భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త తన భార్యను తీవ్రంగా కొట్టాడు. తనపై ఇంకా కోపం చల్లారకా ఇంటి ముందున్న మురికికాల్వలో పడేశాడు. ఈ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది... ఈ ఘటన అక్కడి స్థానికులను కలిచివేసింది. ఇక స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. రమీజా, షేక్ షరీఫ్ అనే ఇద్దరు భార్యా భర్తలు. మొదట్లో వీరి కాపురం సజావుగానే సాగిపోయినప్పటికి ఆ తర్వాత భార్యపై అనుమానం పేరుతో ఎప్పుడు ఘర్షణ పడుతుండేవాడు.

ఈ క్రమంలో నిన్న ( బుధవారం ) ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ జరగడంతో షేక్ షరీఫ్ తన భార్య రమీజాను చితకబాది ఆమెను ఇంటి ముందున్న డ్రైనేజీలో పడేశాడు. ఇందులో అతనికి అతని సోదరి కూడా సహాయం చేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన రమీజా రాత్రంతా మురికికాల్వలోనే ఉండిపోయింది. ఉదయం స్థానికులు ఆమెను గుర్తుంచి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ సంఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని వారిని అదుపలోకి తీసుకున్నారు.  

Tags:    

Similar News