వివాహేతర సంబంధం.. వివాహిత గొంతు కోసిన ప్రియుడు

Update: 2020-03-16 08:42 GMT

గుంటూరు జిల్లా దాచేపల్లి ఎస్సీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు బండి శ్రీను అనే వ్యక్తి. మహిళకు భర్త చనిపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బండి శ్రీను వాగ్వాదానికి దిగాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే తీవ్రంగా గాయపడ్డ ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News