ఈవీఎం మెషీన్‌ను ధ్వంసం చేసిన జనసేన అభ్యర్థి

Update: 2019-04-11 05:24 GMT

అనంతపురం జిల్లా గుంతకల్‌ నియోజకవర్గంలో గుత్తి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల 183వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మదుసూదన్‌ గుప్తా విధ్వంసానికి పాల్పడ్డారు. పోలింగ్‌ ఏర్పాట్లు సరిగా లేవంటూ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)ను ధ్వంసం చేశారు. ఓటింగ్‌ ఛాంబర్‌లో శాసనసభ, లోక్‌సభ అనే పేర్లు సరిగా రాయలేదని పోలింగ్‌ సిబ్బందితో గొడవకు దిగారు. ఆగ్రహంతో ఊడిపోతూ ఈవీఎంను నేలకేసి కొట్టారు. 

Similar News