గుంటూరులో ప్రేమ జంట ఆత్మహత్య

Update: 2020-04-18 04:52 GMT

గుంటూరులో ఓ ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. సదరు యువతి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తుండగా, యువకుడు ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ చిగురించింది. కాగా, రెండు రోజులుగా యువతి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలి మొబైల్‌ ఆధారంగా బ్రాడిపేటలో ఉన్నట్టు టవర్‌ లొకేషన్‌ చూపించడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. దీంతో ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడిన విషయం వెలుగుచూసింది. ప్రేమ వివాహాన్ని పెద్దలు అంగీకరించకపోవడంతోనే ఇద్దరూ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 

Tags:    

Similar News