30రోజుల్లో అద్భుతాలు సృష్టించారు: లక్ష్మీపార్వతి

Update: 2019-07-04 10:31 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ధర్మపాలన మొదలైందని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. 30రోజుల పాలనలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అద్భుతాలు సృష్టించారని అన్నారు. బడుగు బలహీన వర్గాలను డిప్యూటీ సీఎంలుగా, మంత్రులుగా చేసి జగన్ చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఒకవైపు హామీలను నెరవేర్చే దిశగా జగన్ పరిపాలన చేస్తుంటే ఇల్లు చక్కబెడుతుంటే ఎలుకలు ఏడ్చిన విధంగా చంద్రబాబు తీరు ఉందని మండిపడ్డారు. లోకేష్‌ నోరు అదుపులో పెట్టుకోకపోతే టీడీపీ కనుమరుగైపోవడం ఖాయమన్నారు లక్ష్మీపార్వతి.

Tags:    

Similar News