ఉద్ధానం సమస్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. 50కోట్ల రూపాయలతో డయాలసిస్, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. 200 పడకల కెపాసిటీతో ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈమేరకు ఆసుపత్రిలో పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.