తిరువనంతపురం రావలసిందిగా జగన్‌కు కేరళ సీఎం ఆహ్వానం

Update: 2019-10-31 03:06 GMT

ఈ ఏడాది నవంబరు 17 నుంచి శబరిమలలోని శ్రీధర్మశాస్త దేవాలయంలో మండల, మకరవిల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన, ఇతర ముఖ్య అంశాలపై చర్చించేందుకు నవంబరు 5న తిరువనంతపురంలో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రావలసిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డికి కేరళ సీఎం పినరయి విజయన్‌ ఆహ్వానం పంపారు. ఈ ఆహ్వానంపై చీఫ్ మినిస్టర్ కార్యాలయం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ కుదరని పక్షంలో ముఖ్యమంత్రి తరుపున దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను పంపే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

Tags:    

Similar News