Kasibugga CI Suspended: సీఐ వేణుగోపాల్‌ స‌స్పెండ్

Update: 2020-08-05 05:55 GMT

Kasibugga CI Suspended: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్‌‌పై సస్పెన్షన్ వేటు పడింది. ప‌లాస మండ‌లం టెక్క‌లి ప‌ట్నంకు చెందిన ర‌మేష్, జ‌గ‌న్ అనే యువ‌‌కుల మధ్య వారి గ్రామంలో గొడవ జ‌రిగింది. ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌రం కాశీబుగ్గ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విష‌యమై పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చిన జ‌‌గ‌న్ అనే ద‌ళితుడుని సీఐ వేణుగోపాల్ బూటుకాలితో త‌న్నారు. ఈ ఘ‌ట‌న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావడంతో.. ఏపీ డీజీపీ కార్యాల‌యం సీరియ‌స్‌గా తీసుకొని విచార‌ణ జరిపింది. ప్రాథమిక విచార‌ణ జ‌రిపిన తర్వాత విశాఖ డీఐజీ కాళిదాస్ రంగారావు సీఐ వేణుగోపాల‌న్‌ను స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News