Breaking: ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్‌గా జస్టిస్‌ కనగరాజ్‌ నియామకం..

Update: 2020-04-11 04:24 GMT

ఆంధ్రప్రదేశ్‌ కొత్త ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ)గా మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజు నియమితులయ్యారు. ఇవాళ ఉదయం విజయవాడలో ఆయన బాధ్యతలు చేపట్టారు.  ప్రస్తుతం స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ హోదాలో రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిని నియమించేలా ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిన ప్రభుత్వం.. ఆర్డినెన్స్‌ ప్రకారం జస్టిస్‌ వి.కనగరాజ్‌ను నియమించారు.

కాగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక అర్హత నిబంధనలను మారుస్తూ గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్‌ను గెజిట్‌లో ప్రభుత్వం ప్రచురించింది. ఆర్డినెన్స్ స‌వ‌ర‌ణ ద్వారా రమేష్ కుమార్‌కు ఉద్వాస‌న ప‌లికింది ఏపీ ప్ర‌భుత్వం. శనివారం ఉదయం ఇందుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. హైకోర్టు న్యాయమూర్తి స్థాయి అధికారిని నియమించడం, కాలపరిమితి మూడేళ్లకు కుదిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్‌ను గెజిట్‌లో ప్రభుత్వం పేర్కొన్నది.


Tags:    

Similar News