ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టగానే కర్నూలు జిల్లాలో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. కొండారెడ్డి బురుజు వద్ద స్వీట్లు తినిపించుకుని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం న్యాయరాజధానిగా కర్నూలుకు న్యాయం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా మూడు రాజధానుల ఏర్పాటుకు కెబినెట్ అమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.