Jogi Ramesh: టీడీపీ పెత్తందారీ వ్యవస్థను బద్దలుకొట్టిన వ్యక్తి సీఎం జగన్
Jogi Ramesh: సామాజిక న్యాయంపై చర్చిద్దామన్న జోగి రమేష్
Jogi Ramesh: టీడీపీ పెత్తందారీ వ్యవస్థను బద్దలుకొట్టిన వ్యక్తి సీఎం జగన్
Jogi Ramesh: చంద్రబాబు నాయుడికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మీద ప్రేమ ఉంటే అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్లో పాల్గొనాలని మంత్రి జోగి రమేష్ డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం అంటే ఏమిటో ముఖ్యమంత్రి జగన్ నిరూపించారని ఆయన అన్నారు. పెత్తందారి వ్యవస్థను జగన్ బద్దలు కొట్టారని జోగి రమేష్ అన్నారు. అసెంబ్లీ నుంచి పారిపోయిన చంద్రబాబు రోడ్డుమీదకు వెళ్లి ఏదేదో మాట్లాతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు అసెంబ్లీకి వస్తే, 2014 నుంచి 2019 వరకూ బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు ఏంచేశారో 2019 నుంచి జగన్ ఇప్పటి వరకూ జగన్ ఏం చేశారో చర్చిద్దామని జోగి రమేష్ సవాల్ చేశారు.