పవన్ కళ్యాణ్ అమరావతి టూర్ డేట్స్ ఫిక్స్

Update: 2020-02-08 15:53 GMT

అమరావతిలో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు సిద్ధమయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. ఈ మేరకు జనసేన పార్టీ పవన్ టూర్‌కు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో.. " ఈ నెల 15న రాజధాని అమరావతి గ్రామాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. జనసేనాని పర్యటనకు సంబంధించిన ప్రణాళికను ఆ పార్టీ నాయకులు సిద్ధం చేశారు. ఎక్కువమంది ప్రజలను కలిసేలా ఈ పర్యటన ప్రణాళికను రూపొందించాలని పవన్ కళ్యాణ్ చేసిన సూచన మేరకు అందుకు అనుగుణంగా స్థానిక జనసేన నాయకత్వం ఏర్పాట్లను చేస్తోంది. గత నెలలో జరిగిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా గాయపడిన వారు పవన్ కళ్యాణ్‌ను కలిసి మరోసారి అమరావతి గ్రామాలలో పర్యటించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వారికిచ్చిన మాట ప్రకారం ఈ పర్యటన ఖరారైంది. ఈ నెల 12 , 13 తేదీల్లో పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం ఓ రోజు విరామం తీసుకుని 15వ తేదీన అమరావతి గ్రామాల్లో పర్యటిస్తారు." అని పేర్కొంది. నిజానికి ఈనెల 10వ తేదీనే పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటించాల్సి ఉంది. అయితే, సినిమా షూటింగ్‌లు, కర్నూలు జిల్లా టూర్ వల్ల అది వాయిదా పడింది. 

 

Tags:    

Similar News