Jana Sena: వైసీపీ కండువా కప్పుకున్న జనసేన ఎమ్మెల్యే

Jana Sena: పలువురికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం * రాపాక తీరుపై జనసేన పార్టీలో చర్చ

Update: 2021-08-04 07:15 GMT

వైసీపీ లో చేరిన జెనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (ఫైల్ ఇమేజ్)

Jana Sena: జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ మరోసారి వార్తల్లోకెక్కారు. ఏకైక జనసేన ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాపాక ఆది నుంచి ఆ పార్టీకి వ్యతిరేకంగా, వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటూ, సీఎం జగన్‌ను పొగడటం, పాలాభిషేకాలు లాంటివి చేస్తూ పరోక్షంగా జగన్‌ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా మామిడికుదురు మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక పాల్గొన్నారు. అంతేకాదు వైసీపీ కండువాను కప్పుకొని ప్రసంగించారు. అంతటితో ఆగక వేరేపార్టీల నుంచి వైసీపీలోకి చేరిన వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే.. ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Full View


Tags:    

Similar News