అవినీతిపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దన్నారు సీఎం జగన్. ఒత్తిళ్లను ఖాతరు చేయవద్దన్నారు. నామీద ఒత్తిళ్లు ఉన్నాయి ఎలాంటి ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదన్నారు. ప్రజాధనానికి మనం కాపలాదారులుగా ఉండాలా...? లేక అవినీతి చేసిన వారిని వదిలేయాలా అని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంలో అదే పరిస్థితి నెలకొందన్నారు జగన్. అవినీతి లేకుంటే అవే ఇళ్లు తక్కువ ధరకు లభించేవి కావా అని అన్నారు. టెండర్ల ప్రక్రియ మొదలు తీసుకువచ్చిన అప్పుల వరకు ఏది చూసినా వందలు, వేల కోట్ల రూపాయల్లో కుంభకోణాలు కనిపిస్తున్నాయని చెప్పారు. మంత్రి వర్గ ఉపసంఘంతో జగన్ భేటీ అయ్యారు.