ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సిరివెన్నెల కుటుంబానికి ఇంటి స్థలం.. ఆస్పత్రి ఖర్చుల భారాన్ని కూడా..

Jagan: అనారోగ్యంతో మరణించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి అండగా నిలవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2021-12-01 11:43 GMT

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సిరివెన్నెల కుటుంబానికి ఇంటి స్థలం.. ఆస్పత్రి ఖర్చుల భారాన్ని కూడా..

Jagan: అనారోగ్యంతో మరణించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి అండగా నిలవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సిరివెన్నెల వైద్యం ఖర్చులను, ఆస్పత్రి ఖర్చుల భారాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఆస్పత్రి అధికారులతో మాట్లాడినట్లు ఖర్చు మొత్తాన్ని సీఎం సహాయనిధి నుంచి చెల్లిస్తున్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు. సిరివెన్నెల కుటుంబానికి తక్షణం ఇంటి స్థలాన్ని ఇవ్వాలని అందుకు తగిన ఏర్పాట్లు చేసి స్థల పరిశీలన చేయాలని కూడా జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News