చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంటిపై ఐటీ దాడులు

Update: 2020-02-06 08:05 GMT
చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంటిపై ఐటీ దాడులు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ ఇంటిపై ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 2019 ఎన్నికల ముందు వరకు చంద్రబాబు పీఏగా శ్రీనివాస్ పని చేశారు.

ఉదయం నుంచి విజయవాడ, హైదరాబాద్‌లోని శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారనే వార్తలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పోలీసు బందోబస్తు నడుమ ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 వరకు సుదీర్ఘకాలం చంద్రబాబు దగ్గర పీఏగా పని చేశారు శ్రీనివాస్. ప్రస్తుతం జీఏడీలో శ్రీనివాస్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. 


Full View


Tags:    

Similar News