ఏపీ మాజీ మంత్రి భర్తపై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిల ప్రియా భర్త భార్గవ్ పై గచ్చిబౌలి పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ఓ కేసు విషయంలో భార్గవ్ను ప్రశ్నించేందుకు ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ రమేష్ కుమార్ హైదరాబాద్ వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిల ప్రియా భర్త భార్గవ్ పై గచ్చిబౌలి పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ఓ కేసు విషయంలో భార్గవ్ను ప్రశ్నించేందుకు ఆళ్లగడ్డ రూరల్ ఎస్ఐ రమేష్ కుమార్ హైదరాబాద్ వచ్చారు. భార్గవ్ ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించారు. భార్గవ్ పై పలు కేసులువున్నాయి ఆ కేసుల్లో అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. భార్గవ్ హైదరాబాద్లో ఉన్న సంగతి తెలుసుకున్న పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. భార్గవ్ కారు ఆపకుండా వెళ్లిపోరు. భార్గవ్ కారుతో తనను ఢీకొట్టే ప్రయత్నం చేశారంటూ ఎస్ఐ రమేష్ ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.