వైసీపీలోకి భారీగా చేరికలు..

Update: 2019-03-16 13:15 GMT

వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి.. ఇవాళ(శనివారం) జగన్ సమక్షంలో కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక, ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం, ఏపీ కాంగ్రెస్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి, విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల.. విద్యార్థి నాయకుడు నాగేశ్వరరెడ్డి తదితరులు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వీరందికీ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

కాగా అంతకుముందు టీడీపీ సీనియర్ నేత, నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంగా గీత తదితరులు వైసీపీలో చేరారు. ఆదాలకు నెల్లూరు ఎంపీ టికెట్ ఖరారు చేశారు. అలాగే మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఖరారు చేశారు. మరోవైపు కర్నూల్ ఎంపీ బుట్టా రేణుకకు టిక్కెట్ ఖరారు చేయలేదని తెలుస్తోంది.  

Similar News