Chandrababu Naidu: విశా‌ఖలో ఉద్రికత్త.. చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు

Update: 2020-02-27 07:53 GMT

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబును పర్యటనను అడ్డుకునేందుకు నిరసనకారులు విమానాశ్రయానికి భారీగా తరలివెళ్లారు. విమానాశ్రయం వద్ద నిరసనకారులు, వైసీపీ కార్యకర్తల తీరుతో ప్రయాణికులు ఆందోళనకు గురైయ్యారు. విమానాశ్రయం నుంచి చంద్రబాబు కాన్వాయ్‌ బయల్దేరగానే వాహనంపై టమాటాలు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. నిరసనకారులు, వైసీపీ శ్రేణులు రహదారిపై అడ్డంగా పడుకోవడంతో చంద్రబాబు కాన్వాయ్‌ నిలిచిపోయింది. టీడీపీ శ్రేణులు కూడా భారీగా చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


Full View


 

Tags:    

Similar News