అమరావతి లాఠీఛార్జ్‌లపై విచారణ

అమరావతి మహిళలు, రైతులపై వివిధ సందర్భాల్లో లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభమైంది.

Update: 2020-02-23 05:45 GMT

అమరావతి మహిళలు, రైతులపై వివిధ సందర్భాల్లో లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభమైంది. జనవరి 10వ తేదీన రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద రాజధాని తరలింపునకు నిరసనగా ఆందోళన చేపట్టిన మహిళలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాజధాని గ్రామమైన తూళ్లూరు ఎంక్వైరీ చేపట్టారు పోలీసులు.

తుళ్లూరు నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి మొక్కలు, పొంగళ్లు సమర్పించేందుకు బయలుదేరినట్లు మహిళలు తెలిపారు. అయితే పోలీసులు అడ్డుకుని తమపై లాఠీఛార్జ్‌ చేసినట్లు చెప్పారు. తుళ్లూరులో మహిళలపై పోలీస్ చర్యపై నిజనిర్ధారణ జరపనుండటంపై ఆసక్తిగా మారింది.


Tags:    

Similar News