శ్రీహరికోటలోని షార్లో హై అలర్ట్..నిఘా వర్గాల హెచ్చరికతో గట్టి భద్రత
కశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో ఏపీలో ముఖ్యమైన ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది.
కశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో ఏపీలో ముఖ్యమైన ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. దేశంలో కొన్ని చోట్ల ఉగ్రవాదులు దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికతో ఇస్రోలో భద్రతను కట్టుదిట్టం చేశారు. షార్ లోనికి వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొత్తవారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. శ్రీహరికోటతో పాటు సమీపంలోని అడవుల్లో CISF దళాలు మొహరించాయి.