AP Fibernet: ఫైబర్ నెట్ కేసులో కొనసాగుతున్న విచారణ

AP Fibernet: విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణ * హరిప్రసాద్, సాంబశివరావు, గోపిచంద్‌లకు నోటీసులు

Update: 2021-09-14 08:00 GMT

ఫైబర్ నెట్ కేసులో కొనసాగుతున్న విచారణ (ఫైల్ ఫోటో )

AP fibernet Investigation: ఏపీ ఫైబర్ నెట్ కేసులో నిందితుల విచారణ కొనసాగుతోంది. విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. హరిప్రసాద్, సాంబశివరావులు విచారణకు హాజరయ్యారు. హరిప్రసాద్ గత ప్రభుత్వ సాంకేతిక సలహాదారు కాగా, సాంబశివరావు కేంద్ర సర్వీసుల అధికారిగా ఉన్నారు. డిప్యూటేషన్‌పై కొద్దికాలం ఏపీలో సాంబశివరావు పనిచేశారు. మొత్తం 18 మంది పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. 321 కోట్ల ప్రాజెక్టులో 121 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపణ వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని తెలుస్తోంది.

Tags:    

Similar News