AP Three capitals: నువ్వెంత అంటే నువ్వెంత.. టీడీపీ నేత, డీఎస్పీ మధ్య వాగ్వాదం !
గుంటూరు జిల్లాలో జేఏసీ నాయకులు ఆందోళనను ఉధృతం చేశారు. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు- టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. డీఎస్పీ- టీడీపీ నేతల మధ్య మాటల వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వేంత అంటే... నువ్వేంత అంటూ రోడ్డుపై పోలీసులు- టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. టీడీపీ నేతలపై డీఎస్పీ చిందులు తొక్కారు. మరోవైపు అసలు బంద్కు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా బలవంతంగా దుకాణాలు మూసివేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా బంద్కు జేఏసీ పిలుపునిచ్చింది. వ్యాపార సముదాయాలు, స్కూళ్లు, కాలేజీలు స్వచ్ఛందంగా మూసివేశారు. రిలే నిరాహారదీక్షలు, నిరసనలతో తుళ్లూరు, మందడం, వెలగపూడి, మంగళగిరి, యర్రబాలెం, కృష్ణయపాలెం, తాడికొండ గ్రామాలు ఉద్రిక్తంగా మారాయి.