Rajahmundry: జూనియర్ ఎన్టీఆర్‌ టీడీపీ కోసం పనిచేయాలి- గోరంట్ల

Rajahmundry: రాజమండ్రిలో టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

Update: 2021-03-29 11:15 GMT

Rajahmundry: రాజమండ్రిలో టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. త్వరలోనే టీడీపీలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయని ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ఈ సందర్భంగా అన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌తో పాటుగా అనేక మంది టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని బుచ్చయ్య కోరారు. ఒకపక్క రాష్ట్రం అప్పులకుప్పగా మారితే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వైజాగ్‌లో రాజధాని ఎలా నిర్మిస్తారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

Tags:    

Similar News