80 శాతం పోలింగ్‌ నమోదయ్యే అవకాశం: ద్వివేదీ

Update: 2019-04-11 15:24 GMT

ఆంధ్రప్రదేశ్‌లో 80 శాతం పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 65.96 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉండటంతో.. 8 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. అందువల్ల 80 శాతం పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉంది. పోలింగ్‌ శాతం లెక్కించడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పారాయన

ఇదిలావుంటే చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 25 ఘర్షణలు చోటుచేసుక్నుట్టు పోలీసు శాఖ తెలిపింది. ఆరు చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఆ ఘటనల్లో ఇద్దర మరణించగా, కొందరు గాయపడ్డారు.80 శాతం పోలింగ్‌ నమోదయ్యే అవకాశం: ద్వివేదీ 

Similar News