రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కచ్చులూరు బోటు ప్రమాద బాధిత కుటుంబాలు నిరసన తెలుపుతున్నాయి. బాధితులకు మాజీ ఎంపీ హర్షకుమార్ మద్దతు తెలిపారు. మునిగిపోయిన బోటును వెలికితీయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై హైకోర్టు జోక్యం చేసుకోవాలని బాధితులు కోరుతున్నారు. దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం సంబంధిత బంధువులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఆర్తనాదాలతో ప్రభుత్వాసుపత్రిలో ఆవరణలో ఇంకా విషాద వాతావరణం కొనసాగుతూనే ఉంది.