గోదావరిలో బోటు వెలికితీత ముమ్మరం..లంగరు వేసి లాగుతుండగా..

Update: 2019-10-01 09:16 GMT

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు వెలికితీత యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బోటు వెలికితీతలో భాగంగా పొక్లైన్తో రోప్ లాగుతుండగా తొలి ప్రయత్నం విఫలమైంది. రోప్ తెగిపోవడంతో ధర్మాడి సత్యం బృందం మరో లంగరు వేసే ప్రయత్నాలు చేస్తోంది. అయితే 25 టన్నుల బరువున్న ఆ బోటు, గోదావరి వరద కారణంగా ఇసుకతో నిండిపోయి మరింత బరువెక్కి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే రోప్ తెగిపోయి ఉంటుందని వెలికితీతలో పాల్గొంటున్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

Tags:    

Similar News