తూర్పుగోదావరి జిల్లా గోదావరి బోటు ప్రమాదంలో మృతులకు ద న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ బీమా పరిహారాన్ని చెల్లించనుంది. ప్రమాదానికి గురైన వశిష్ట రాయల్ బోటుకు 45లక్షలు పర్యాటకులకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున బోటు యాజమాన్యం బీమా చేయించింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయిల పరిహారానికి ఈ ప్రత్యేక బీమా అదనంగా చెల్లించనున్నారు.