Ganta Srinivasa Rao: మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదిస్తారా
Ganta Srinivasa Rao: రాజకీయ లబ్ధి కోసం రాజీనామాను ఆమోదించారు
Ganta Srinivasa Rao: స్పీకర్ తమ్మినేని సీతారామ్పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదిస్తారా అని స్పీకర్పై విమర్శలు గుప్పించారు. అప్పుడే రాజీనామాను ఆమోదించి ఉంటే ఉపఎన్నికల్లో వైసీపీ ఓడిపోయేదన్నారు. రాజ్యసభ ఎన్నికల గురించి జగన్ ఎంత భయపడుతున్నారో తన రాజీనామా ఆమోదంతో అర్థమవుతోందని గంటా ఎద్దేవా చేశారు. రాజ్యసభ ఎన్నికలలో టీడీపీ బలం తగ్గించాలని వైసీపీ చూస్తుందని ఆయన మండిపడ్డారు.