సీఎం జగన్‌కు మాజీ ఎంపీ ఉండవల్లి లేఖ

Update: 2019-11-13 11:59 GMT

సీఎం జగన్‌కు మాజీ ఎంపీ, కాంగ్రెస్ బహిష్కృత నేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌ లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై ప్రధాని, హోంమంత్రి చేసిన వ్యాఖ్యల గురించి.. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించాలని లేఖలో పేర్కొన్నారు. కాగా రాష్ట్రవిభన జరగలేదంటూ మొదటినుంచి వ్యతిరేకిస్తున్నారు ఉండవల్లి. తలుపులు మూసి బిల్లు పాస్ కాకుండానే రాష్ట్ర విభజన జరిగిపోయిందని మోసం చేశారని చాలా సార్లు అన్నారు. దీనిపై ఏపీ ఎంపీలు మాట్లాడాలని పలుమార్లు అన్ని పార్టీల ఎంపీలను ఉండవల్లి కోరారు. ఇదే విషయమై గతంలో ఓ సారి అప్పటి సీఎం చంద్రబాబును కూడా కలిశారు ఉండవల్లి. 

Tags:    

Similar News